telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ కార్యాలయానికి .. బాంబు బెదిరింపు..

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అధికారులు హుటాహుటిన ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఫోన్ కర్ణాటకలోని మైసూర్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. మరోవైపు కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం అందించి ఫోన్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలపై ఆరా తీసే పనిలోపడ్డారు.

Related posts