telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అయోధ్యలో 5 లక్షల దీపాలు… అయినా చీకటి… : ప్రముఖ రచయిత ట్వీట్ వైరల్

Ayodhya

దీపావళి సందర్భంగా అయోధ్యలో 5 లక్షలను వెలిగించడం విశేషంగా మారింది. దీపావళి సందర్భంగా యూపీ ప్రభుత్వం దీపోత్సవం పేరిట అయోధ్యలో 5 లక్షల 51 వేల దీపాలను వెలిగించింది. ఈ ఈవెంట్ గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది కూడా! అయితే ఆ తరువాత సోషల్ మీడియాలో ఒక బాలిక దీపం వెలిగిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. తాజాగా ఈ ఫొటోను షేర్ చేస్తూ బాలీవుడ్ రైటర్ మనోజ్ యాదవ్ సంచలన కామెంట్ చేశారు. ఆయన ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఐదు లక్షల దీపాలు వెలిగించినా కూడా చీకటి తొలగిపోదు. సూర్యుడు ఉదయిస్తేనే చీకటి తొలగిపోతుంది’ అని కామెంట్ చేశారు. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.

Related posts