ప్రస్తుతం సినిమా స్టార్స్ అందరూ డిజిటల్ తెర కోసం రూపొందే చిత్రాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ తదితర స్టార్లు ఓటీటీ చిత్రాలకు ‘ఓ యస్’ అనేశారు. ఇక రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరుగుతోంది. దాంతో వందల కోట్లు పెట్టి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు 90 కోట్లతో భారీ యాక్షన్ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యిందట. వెబ్ సిరీస్ ను 6 ఎపిసోడ్ లుగా చిత్రీకరించబోతున్నారట. ఆ 6 ఎపిసోడ్ లు కూడా అద్బుతమైన యాక్షన్ సీన్స్ ను కలిగి ఉంటాయని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు గాను హృతిక్ రోషన్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నాడట. ఇండియన్ స్టార్ ఒక వెబ్ సిరీస్ కోసం ఇంత భారీ స్థాయి పారితోషికం అందుకోవడం ఇదే ప్రథమం. ఈ సిరీస్లో హృతిక్ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారట. చూడాలి మరి ఇది అభిమానులను మెప్పిస్తుందా… లేదా అనేది.
previous post