బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా సమయంలో రియల్ హీరోగా నిలిచాడు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులని సొంత రాష్ట్రాలకి ప్రత్యేక బస్సుల ద్వారా పంపారు. వీటితో పాటు మెడికల్ సిబ్బందికి కూడా తన వంతు సాయం చేయడం, పేదల ఆకలి తీర్చడం వంటివి చేశాడు. సోనూ సూద్ పేరు ఇప్పుడు దేశమంతా మారు మ్రోగిపోతుంది. ఆయనకి సంబంధించిన ఏ విషయమైన కొద్ది క్షణాలలో వైరల్ అవుతుంది. 24 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు సోనూసూద్కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాస్కి సంబంధించిన ఫోటోని అరవింద్ పాండే తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. కష్టపడ్డ వాడికి పేదల కష్టాలు తెలుస్తాయని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. జీవితం చక్రంలా తిరుగుతూ ఉంటుందని అన్నాడు. 1997జూలైలో సోనూసూద్కి పశ్చిమ రైల్వే శాఖ నెలవారీ పాసు జారీ చేసింది. ముంబైలోని బొరివాలి నుండి చర్చిగేట్ వరకు సోనూ రైలులో ప్రయాణిస్తుండగా, ఇందులో కోసం 420 రూపాయలు పెట్టి పాస్ తీసుకున్నాడు.
previous post