కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల అతడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది దర్శక నిర్మాతలు సోనూని తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం ఆయన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల సోనూసూద్ రెమ్యునరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం సోనూసూద్ను సంప్రదించారు. అయితే ఆయన చెప్పిన రెమ్యునరేషన్ విని బోయపాటి టీమ్ షాక్ అయ్యిందట. సినిమాల ద్వారా ఎక్కువ సంపాదించి ఆ మొత్తాన్ని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వినియోగించాలన్న ఆయన ప్లాన్గా తెలుస్తోంది. సోనూసూద్ ఇప్పటివరకు సినిమాకు రూ.1-1.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో ఆయన కోసం వెళ్లిన తెలుగు దర్శక నిర్మాతలు ఏం మాట్లాడలేక వెనుదిరుగుతున్నారట. ఇలాగే మరో నిర్మాతకు కూడా ఇదే విధంగా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు సోనూ రెమ్యునరేషన్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
previous post
next post
రామ్ చరణ్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు