బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ముంబయికి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నటుడు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఎఫ్ ఆర్ ప్రకారం ఇలా..
జూలై 2014లో, ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాతో పాటు ఇతరులు సంస్థలో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు ఫిర్యాదుదారు తెలిపాడు. SFL ఫిట్నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీని కేటాయిస్తుందని.. అంతేకాకుండా పొరుగున ఉన్న పూణేలోని హడప్సర్, కోరేగావ్లలో జిమ్, స్పాను తెరుస్తుందని తనకు హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు తెలిపాడు.
అయితే డబ్బు ఇచ్చినప్పటికీ, వారి ప్రపోజల్ కార్యరూపం దాల్చలేదని వెల్లడించాడు. తరువాత, ఫిర్యాదుదారు తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరిన నప్పడు, అతడిని బెదిరించబడ్డాడని ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా, బాంద్రా పోలీసులు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం) సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్టైన రాజ్కుంద్రా..సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. బెయిల్పై విడుదలైన తర్వాత, రాజ్ కుంద్రా గత వారం భార్య శిల్పాశెట్టితో కలిసి మొదటిసారిగా బయట కనిపించారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో దేవాలయంలో పూజలు చేస్తూ, ప్రార్థనలు చేశారు.
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా