telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు.. నిన్న సున్నా నేడు 99 మార్కులు !

inter board telangana

తెలంగాణలో ఇంటర్ బోర్డు లీలలు బయటపడ్డాయి. .ఈ నెల 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి. ఇంటర్ ఫస్టియర్ తెలుగు సబ్జక్టులో 98 మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి సెకండియర్ లో ఆమెకు సున్నా మార్కులు వచ్చినట్టు మెమోలో చూపారు. దాంతో ఆ విద్యార్థిని బోరున విలపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో, సున్నా మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని తెలుగు పేపర్ ను రీవాల్యుయేషన్ చేయించగా, దిమ్మదిరిగే రీతిలో 99 మార్కులు వచ్చినట్టు తేలింది.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని నవ్యకు రీవెరిఫికేషన్‌లో 99 మార్కులు వచ్చాయి. ఇంటర్‌ ఫస్టియర్‌లో నవ్య మంచిర్యాల జిల్లా టాపర్‌‌గా నిలిచింది. సెకండియర్‌ తెలుగులో సున్నా మార్కులు వేయడంతో ఆమె నిన్న ఇంటర్‌ బోర్డు ఆఫీసు ఎదుట ఆందోళన చేసింది. దీంతో అధికారులు రీవెరిఫికేషన్‌ చేశారు. దీంతో తెలుగులో 99 మార్కులు వచ్చాయి.అనుభవంలేని వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించిన కారణంగానే మార్కులు అస్తవ్యస్తంగా వేశారంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts