తెలుగు భాషను కాపాడేందుకు కృషి చేస్తానని బీజేపీ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం బేగంపేట హరితప్లాజాలో విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృ భాషను కోపాడుకోవడం కోసమే బంగ్లాదేశ్గా ఏర్పడిందన్నారు. తెలుగు మాట్లాడని వాడు మేధావి కాలేడని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యార్థులు 6వ తరగతి వరకు తెలుగులో చదవాలన్నారు. తాను గతంలో జైల్లో ఉన్నానని.. వెబ్సైట్లో చూసి తన పిల్లలు ఆశ్చర్యపోయారని విద్యాసాగర్రావు అన్నారు. ఏదైనా కుంభకోణం చేసి జైల్లో ఉన్నానని అనుకున్నారని, తర్వాత పిల్లలకు వివరంగా చెప్పాల్సి వచ్చిందన్నారు.