telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి కరోనా

Umabharathi BJP

బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతికి కరోనా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా పాటిజివ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని హరిద్వార్‌-రిషికేశ్‌ మధ్య వందేమాతరం కనౌజ్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు.

నాలుగురోజుల తరువాత తాను మరోసారి కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటానని తిరిగి పాజిటివ్‌ వస్తే వైద్యులను సంప్రదిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనను ఈ మధ్య కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకొని క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. ఇటీవల హిమాలయ పర్యటనకు వెళ్లిన ఆమె అన్ని కోవిడ్ -19 నిబంధనలు అనుసరించినా కరోనా పాజిటివ్ బారినపడటంపై బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు.

Related posts