telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు: బీజేపీ మ్మెల్సీ సోము వీర్రాజు

Somu-Veerraju bjp

బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమను సంప్రదించారని చెప్పారు.

మిగిలిన వారు కూడా ఆయన బాటలోనే ప్రయాణించనున్నారని తెలిపారు. త్వరలో అధిష్ఠానం పెద్దలతో మాట్లాడి టీడీపీ ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో కలుపుకుంటామని తెలిపారు. ఆసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేని పరిస్థితి వస్తుందన్నారు. ఎన్ని చేసినా చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

Related posts