telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రారంభ‌మైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

*ప్రారంభ‌మైన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు..
*వేదిక‌పై మోదీ, న‌డ్డా , గోయ‌ల్‌
*జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన మోదీ ,న‌డ్డా , పీయూష్ గోయాల్‌

నోవాటెల్‎లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వేదికపై ఆసీనులు అయ్యారు.

జ్యోతి ప్రజల్వన చేసి ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీని కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌లు శాలువతో సత్కరించారు. జేపీ నడ్డాను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. పీయూష్ గోయల్‌‌కు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాలువతో సత్కరించారు.

ఈ సమావేశాలకు ప్రధాని మోదీ తో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కేంద్రమంత్రులు ఇతర బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 350 మందివరకు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి.

Related posts