telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు గుర్తించినా ప్రభుత్వం గుర్తించడం లేదు: ఎంపీ బండి సంజయ్

bandi samjay mp

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్ లో రెండవ రోజు జమ్మికుంటలో ఆయన గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన సమస్యలను హైకోర్టు గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ .. సమస్యల వలయంగా మారిందన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన సమస్యలను హైకోర్టు గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అన్ని నిధులను దోచుకుంటోందన్నారు. గాంధీజీ ఆశయాల మేరకే గాంధీ సంకల్పయాత్ర ప్రారంభించామని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పొన్నం బీజేపీని గాడ్సే పార్టీ అనడం సరికాదని సంజయ్ అన్నారు.

Related posts