telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిజమాబాద్ ఎంపీ ధర్మిపురి అర్వింద్ కు చేదు అనుభవం..

నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామానికి విచ్చేసిన ఆయనను గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమం లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్తితిని అదుపులోకి తెచ్చారు. గన్నారం గ్రామంలో వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం ఉండగా ఎంపీపీ ముందుగానే కార్యక్రమాలను పూర్తి చేశారు.

ఎంపీ అర్వింద్ వచ్చేలోపే ప్రారంభించేశారు. దీంతో బీజేపీ, టిఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ మొదలయ్యింది. జాతీయ రహదారి నుండి గాన్నరం వైపు వెళ్లేందుకు వచ్చిన ఎంపీ కన్వాయిని అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు.అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పరిస్థితి చేయి దాటుతున్న సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

Related posts