telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సవాల్…

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త ఛాలెంజ్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే డ్రగ్స్ అంశంపై బండి మాట్లాడుతూ… అసెంబ్లీలో కరోన టెస్టులకు బదులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలి. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలు ఎవరు సీఎం కేసీఆర్ కు తెలుసు. వారి చేత వెంటనే రాజీనామా చేయించాలి లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెపుతారు అని అన్నారు. టీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లో హోటల్ అడ్డగా చేసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్ దందా చేస్తున్నారు. అదేదో గ్రీన్ ఛాలెంజ్ అని చేస్తున్నారు కదా… నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా… అంటే కొకైన్… డ్రగ్ తీసుకుంటారు కదా… దాని టెస్ట్ చేయించుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నా… నువ్వు, నీ ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారా… దమ్ముంటే రండి, టెస్ట్ కు బ్లడ్ ఇస్తారా అని పేర్కొన్నారు. అయితే చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది… ఎవరు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తారు అనేది.

Related posts