కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.తాజాగా.. ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనా తో పోరాడుతూ మృతి చెందారు. కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్యే చికిత్స కోసం ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలోని సాల్ట్ సీటుకు చెందిన ఎమ్మెల్యే. కొద్దిరోజుల కింద సురేంద్ర సింగ్ భార్య గుండెపోటుతో మృతి చెందారు. ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి సురేంద్ర సింగ్ బీజేపీ కి తీరని లోటని స్థానిక నేతలు పేర్కొన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
previous post
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి