telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి..

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితే చాలు ఎటాక్ చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు. తాజాగా బీజేపీ నేత, రాజస్థాన్‌ లోని రాజ్‌ సమండ్‌కు చెందిన ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి గురు గ్రామ్‌లోని మేదంతా ఆస్పత్రిలో ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆమెకు కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలడంతో గురుగ్రామ్‌ మేదంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. గత 21 రోజులుగా మహేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఇక ఆమె మృతదేహాన్ని ఇవాళ సాయంత్రం వరకు ఉదయపూర్‌కు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. గత వారం ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు.

Related posts