telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు…

కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. టీఆర్ఎస్ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ ను చేతిలోకి తీసుకున్నారని.. బీజేపీ నాయకులను అరెస్టు చేసి దాడులకు పాల్పడ్డా.. టీఆర్ఎస్‌ నేతలను అరెస్ట్ చేయకపోవడం సీఎం కేసీఆర్ కుట్రలో భాగమేనని ఫైర్ అయ్యారు. దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు వివేక్. ఇక, రామ మందిర నిర్మాణంలో అన్ని వర్గాల మద్దతు ఉండాలనే ఉద్దేశంతోనే అందరినీ భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.. రామ మందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్న వివేక్.. రామమందిర నిర్మాణం నిధుల సేకరణ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. రామ భక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts