హైదరాబాద్ ఈఎస్ఐలో కోట్ల రూపాయల మేర కుంభకోణం జరగడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ఈఎస్ఐ మందుల స్కామ్లో అధికారపార్టీనేతలు ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అంటేనే స్కాంల సర్కార్గా మారిందని లక్ష్మణ్ దుయ్యబట్టారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి స్కీమ్వెనకా పెద్ద స్కాం ఉందని ఆయనఅన్నారు. అన్నిశాఖల్లోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీటీమ్అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని కట్టడి చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.హుజూర్ నగర్లో కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్టేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.