telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలి: కన్నా డిమాండ్

Kanna laxminarayana

విశాఖపట్నంలో జరిగిన విషవాయువు లీక్ ఘటనపై దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడిన ఘటన తీవ్రంగా కలచివేస్తోందన్నారు. వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. విషవాయు ప్రభావంతో కళ్లు కనిపించక ఓ వ్యక్తి బావిలో పడి మరణించడం అత్యంత దయనీయమన్నారు.

ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఈ ప్రమాదంలో మూగజీవాలు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పట్ల లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. మృత్యువాతపడ్డ మూగజీవాల యజమానులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Related posts