telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మత ప్రచారకులకు ప్రభుత్వ నిధుల నుంచి వేతనం: కన్నా ఫైర్

Kanna laxminarayana

ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మత ప్రచారకులకు ప్రభుత్వ నిధుల నుంచి వేతనం చెల్లించడం పై ఆయన మండిపడ్డారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా సమాజాన్ని, మతాలను విభజించి లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నా విమర్శించారు.

ఇందుకోసం ప్రజాధనాన్ని వినియోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేతనాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చెల్లించేందుకు నిర్ణయించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య, లౌకికదేశమైన భారత్ లో ప్రజాధనాన్ని వినియోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రతిని కూడా జతచేశారు.

Related posts