telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం దిగొచ్చినట్టు నటిస్తోంది: కన్నా

Kanna laxminarayana

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బీజేపీ పోరాటం చేపట్టడంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చినట్టు నటిస్తోందని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జీవో నెం.888 జారీ చేయడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. అయితే ఆ జీవో ఒక చీటింగ్ జీవో అని, తద్వారా ఈ ప్రభుత్వం ఆఖరికి దేవుడ్ని కూడా మోసం చేసిందని ఆరోపించారు.

2016లో అప్పటి టీటీడీ బోర్డు ఇచ్చిన ఆర్.253ని నిలుపుదల చేశారే తప్ప, ఈ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు ఇచ్చిన ఆర్.309ని రద్దు చేయలేదని, ఇది పూర్తిగా మోసపూరితం అని మండిపడ్డారు.. వాస్తవానికి టీటీడీ ఆస్తుల విక్రయానికి నిరసనగా ఇవాళ ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఇంతలోనే ఏపీ సర్కారు జీవో తీసుకువచ్చింది.టీటీడీ ఆస్తుల విక్రయం నిలుపుదల చేస్తూ నిన్న ఏపీ సర్కారు జీవో నెం.888 జారీ చేసినా ఏపీ బీజేపీ మాత్రం మండిపడుతోంది.

Related posts