తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే..విజయ కేతనం ఈటెల రాజందర్ ఎగురవేశారు.
హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్లో 1333 ఓట్ల లీడ్ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 24 వేల పైచిలుకు ఓట్లు ఆధిక్యంతో ఈటల రాజేందర్ భారీ విజయాన్ని సాధించారు.
భాజపా- తెరాస హోరాహోరిగా తలపడిన హుజురాబాద్ ఉపఎన్నికలో తొలి రౌండ్ నుంచే ఈటల రాజేందర్ ఆధిపత్యం సాధించిన ఈటల… కేవలం రెండు రౌండ్లలో మాత్రమే స్వల్ప తేడాతో వెనుకబడ్డారు.మొత్తంగా… 23,855 ఓట్ల మెజార్టీతో ఈటల ఘన విజయాన్ని సాధించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్నగర్లోనూ ఈటలకు ఆధిక్యం దక్కింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఈటల పైచేయి సాధిం