telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి కేసిఆర్ రాజీనామా చేయాలి: డీకే అరుణ

DK Aruna comments on congress

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత డీకే.అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సీట్లను చూస్తుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్తగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 

దేశంలో రాహుల్ గాంధీయే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందనే చెప్పవచ్చన్నారు. కాంగ్రె‌స్‌లో కొనసాగుతున్న నేతలంతా బీజేపిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపి అవతరించిందని వ్యాఖ్యానించారు.మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ నేతలకు చెమటలు పట్టించే విధంగా ఈ ఎన్నికలు జరిగాయని అరుణ అన్నారు. పాలమూరు పార్లమెంటులో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ  ఇక్కడ బీజేపిదే నైతిక విజయమన్నారు. 

Related posts