తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బోర్డు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదని తేల్చిచెప్పారు.బంగారు తెలంగాణ కావడం పక్కనపెడితే రాష్ట్రం ఇప్పుడు బలుల తెలంగాణగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రేపు బీజేపీ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.ఈ దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు.