*సెంటిమెంట్ రాజేయడంలో కేసీఆర్ ముందుంటారు..
*కేసీఆర్కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయం..
*రైతంగాన్ని గౌరవించే వ్యక్తి పియూష్ గోయాల్..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావడం సీఎం కేసీఆర్కు ఇష్టం లేదంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమేనంటూ ఆయన దుయ్యబట్టారు
అబద్ధాలు ఆడటంలో సీఎం కేసీఆర్ నెంబర్వన్ అని బండి సంజయ్ అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులను ఢిల్లీకి పంపితే న్యాయం జరిగిందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం కావాలని కేసీఆర్కు లేదని, సమస్య కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ నేతలు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నూకలు తినాలని కేంద్రమంత్రి షీయూష్ గోయల్ అనలేదని తెలిపారు. ఇన్ని ఏళ్లుగా ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్హౌస్లో వరి పండిస్తున్నారో.. గంజా పండిస్తున్నారో చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసే హక్కు సీఎం కేసీఆర్కు లేదని బండి సంజయ్ అన్నారు.
రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి