telugu navyamedia
తెలంగాణ వార్తలు

భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు దిగుతాం-బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

*బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
*భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు దిగుతాం
*రామ‌య‌ణం, మ‌హాభార‌తాన్ని కామెడీగా చూస్తున్నారు.

తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు చేస్తామని అన్నారు. రామాయణం, మహాభారతాన్ని కామెడీగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకుంఠధామాలకే భగవద్గీత పరిమితం అయిందని అన్నారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

రామాయణం, భగవద్గీత‌ను కూడా కించపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే… ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అర్చకులను, దేవుళ్లను కించపరచడం మంచి సంస్కృతి అనిపించుకోదన్నారు. బీజేపీ అంటేనే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే పార్టీ అన్నారు. ఇమామ్‌లకు ఇచ్చే గౌరవం.. అర్చకులకు ఇవ్వరా అని ప్రశ్నించారు.

Image

ప్రజా సంగ్రామ యాత్ర 3 లో భాగంగా బండి సంజయ్ జనగామ సమీపంలోని కుందారంలో అర్చకులతో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అర్చకులు బండి సంజయ్ ను సత్కరించారు. హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అర్చకులకు రూ.6 వేలు ఇవ్వడానికే కేసీఆర్​కు దిక్కు లేదా అని నిలదీశారు.

అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీలో లాబీయింగ్‌లు ఉండవని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఉంటాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.బ్రాహ్మణులకు కూడా రాజకీయంగా మసహకరిస్తాం.. మీరందరూ క్షేమంగా ఉంటే.. మేము సంతోషంగా ఉంటామని తెలిపారు.

Related posts