telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది: అమిత్ షా

amith shah bjp

ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి వుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఈ అల్లర్లకు కారకులను గుర్తించేందుకు కేంద్రం ఆధార్ డేటా వినియోగిస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్ల కారకులను గుర్తించడంలో తాము ఆధార్ డేటా జోలికి వెళ్లడంలేదని స్పష్టం చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఢిల్లీ అల్లర్లకు విదేశీ సంస్థలతో పాటు దేశంలోని మరికొన్ని సంస్థలు నిధులు సమకూర్చినట్టు ఆధారాలు ఉన్నాయని అమిత్ షా అన్నారు.

Related posts