ఆధునిక యుగంలో ప్రపంచాన్ని ఊరిస్తున్న బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ.. భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. కంటికి కనబడని కరెన్సీ.. అంకెలతో గారడీ దేశ ఆర్ధిక స్థిరత్వానికి ప్రమాదకరమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు.
భారతదేశంలో క్రిప్టోకరెన్సీని నియంత్రించేవిధంగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించి బిల్లు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన ఉందన్నారు. క్రిప్టో కరెన్సీ ప్రోత్సహించడం ఆరోగ్యకరం కాదని గణాంకాలతో విశ్లేషించారు. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ ప్రోత్సహించేందుకు, కొత్త ఖాతాల ప్రారంభించేందుకు రుణసౌకర్యం, ట్రేడింగ్ ప్రోత్సహకాలు ఆర్థికంగా దెబ్బతీసే సంకేతాలు కన్పిస్తున్నాయనే అనుమానం వ్యక్తంచేశారు.