బీహార్ ప్రభుత్వం ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ధరించే డ్రెస్సుల పై ఆంక్షలు విధించింది. సచివాలయంలో పని చేసే ఉన్నతాధికారులు, ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరూ ఫార్మల్ డ్రస్సులు ధరించి, విధుల్లోకి రావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే ఇటీవల కాలంలో ఉద్యోగులందరూ జీన్స్, టీ షర్టులు ధరించి కార్యాలయానికి రావడం వల్లే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయ వాతావరణం, పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి