telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీబీఐకి సుశాంత్ కేసు… బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Sushanth

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు ఇద్దరూ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. కాగా దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిన్న బీహార్‌ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు. ముంబై పోలీసులు, బీఎంసీ అధికారుల తీరుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో ముంబై పోలీసులు బీహార్‌ పోలీసుల విచారణకు సహకరించట్లేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది.

Related posts