telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్!

EC election commissiion

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబరు 29తో ముగియనుండి. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సురక్షిత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. తక్కువ దశల్లోనే ఎన్నికలను ముగించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బీహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మరోమారు అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఈసారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలోకి నిలవనున్నట్టు తెలుస్తోంది.

Related posts