telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : హోస్ట్ గా రమ్యకృష్ణ… రాజు దూరంగా ఉన్నప్పుడు రాణి వచ్చింది…

Ramyakrishna

బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం మ‌రింత ర‌సవ‌త్త‌రంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్ప‌టికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ‌, జాఫ‌ర్, త‌మ‌న్నా, రోహిణి, అషూ రెడ్డి బ‌య‌ట‌కి వెళ్ళారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది స‌భ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి స‌భ్యుల మ‌ధ్య నామినేష‌న్ ప్ర‌క్రియ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్. అయితే ఈ సీజ‌న్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి శ‌ని, ఆదివారాల్లో హోస్ట్ చేసి ఎలిమినేష‌న్ చేస్తూ వ‌చ్చిన నాగార్జున‌ ఈవారం అందుబాటులో ఉండ‌ర‌ట‌. అందుకోసం ఆయ‌న త‌న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ కోసం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్పెయిన్ వెళ్లారు. ఇప్పుడు నాగ్‌ స్థానంలో ఈ వీకెండ్‌ స్పెషల్‌ గెస్ట్‌గా రమ్యకృష్ణ వచ్చేస్తున్నారు. రాజు దూరంగా ఉన్నప్పుడు రాణి వచ్చిందంటూ రిలీజ్‌ చేసిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బాహుబలి చిత్రంలోని పాపులర్‌ డైలాగ్‌ ఇదే నా మాట.. నా మాటే శాసనం అని ఈ ప్రోమోలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులు తాజాగా వీడియో విడుదల చేశారు. శని, ఆదివారం ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

Related posts