ఎప్పుడెప్పుడా అని ఎదురు తెలుగు బిగ్బాస్ 5 అభిమానుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం అయ్యింది..నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని..ఐదో సీజన్ లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ నుంచి బిగ్బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది.ఈ సంవత్సరం షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు తెర దించుతూ నిర్వాహకులు ప్రోమో వదిలిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో సర్ప్రైజ్కు ప్లాన్ చేస్తున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రోమో షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఫైనల్ చేశారట. ఇపుడు సీజన్ 5 కోసం కొత్త మొఖాలు కాకుండా పాపులర్ ఫిగర్స్ను రంగంలోకి దింపబోతున్నారంట. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్లుకు సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
కరోనా నేపథ్యంలో నేరుగా హౌస్ లోకి పంపించకుండా ఆగస్ట్ 22 నుంచి వారికి క్వారంటైన్కు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్ చేసి, సెప్టెంబర్ 5న నేరుగా బిగ్బాస్ హౌస్లోకి పంపుతారట. ప్రతి కంటెస్టెంట్కి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బిగ్బాస్ హౌస్లోకి అనుమతించనున్నారు.
తాజాగా హౌస్లోకి అడుగుపెట్టబోతున్న వారిలో..యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈసారి కూడా హోస్ట్గా నాగార్జుననే వ్యవహరించనున్నారు.