telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బీ

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెండు భారీ సినిమాలకు ఓకే చెప్పారు ప్రభాస్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 21వ మూవీగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసారు. తాజాగా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగం అవుతుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగిపోయాయి.

Related posts