కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా రాజధాని నిర్మాణం చేపడతానని ఏపీసీఎం చంద్రబాబు ప్రతిన పూనినట్టుగానే శాశ్వత భవనాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా, రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, ఐటీ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 18వతేదీ నుంచి మార్చి 14వరకు బిడ్లకు గడువును విధించింది.
శాశ్వత అసెంబ్లీ రూ.455 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే రూ.328.50 కోట్ల అంచనా వ్యయంతో ఐటీ పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల