మా అక్క అఖిలప్రియ విషయంలో భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు… ఆమె చెల్లెలు భూమా మౌనిక. ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన ఆమె… త్వరలోనే అందరి పేర్లూ బయటపెడతామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కూడా కలవబోతున్నట్లు చెప్పారు… భూమా మౌనిక. అరెస్టు వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఉందన్న ఆమె అక్కకు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆడపిల్ల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారని, అక్కకు బెయిల్ వచ్చాక అందరి పేర్లు బయట పెడతానని అన్నారు. కేసుల గురించి త్వరలో గవర్నర్, కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి, డిజిపిని కలుస్తానన్న ఆమె భూమా కుటుంబం నుంచి నేను బాద్యత తీసుకుంటానని ఆమె అన్నారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్ల నుంచి ఆళ్లగడ్డకు రాలేక పోయానన్న ఆమె ఏ చిన్న సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తే అండగా ఉంటానని అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడ వద్దు, కేసులు, రాజకీయ వత్తిల్లు భూమా కుటుంబానికి కొత్తేమి కాదని అన్నారు. అక్కకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొద్దామని ఆమె అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
రెడ్డి క్యాస్ట్ కాదు అదొక ఒక టైటిల్..మాజీ ఎంపీ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు