ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండే ఈ ఎన్నికలలో మోడీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళీ మోడీని గెలిపించి, అన్యాయం అయిపోవటం ఇష్టంలేదని, అందుకే ఆయనపై తానే స్వయంగా పోటీకి దిగుతానని అంటున్నాడు భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. ఈ సారి మోడీ ఎట్టిపరిస్థితులలోనూ గెలవారని, ఆయనను ఓడించడమే తన లక్ష్యమని ఆజాద్ అన్నాడు.
ప్రతిపక్షాలు కూడా కుట్రలతో, వారణాసి నియోజక వర్గంలో మోడీపై బలహీనమైన అభ్యర్థిని నిలపాలని చూస్తున్నారని, అదే జరిగితే ఆయనకు గెలుపు సులభం అవుతుందని అన్నాడు ఆజాద్. అందుకే తానే స్వయంగా బరిలోకి దిగాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఇక ఇటీవల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనను పరామర్శించడానికి వచ్చిందని, ఆమెను తాను ఆహ్వానించలేదని ఆజాద్ స్పష్టం చేశాడు.