“శ్రీనివాస కళ్యాణం” సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ తాజాగా కెమేరా ముందుకొచ్చాడు. దాదాపు పది నెలల తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించాడు. “ఛలో” దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న “భీష్మ” సినిమా ఈ రోజు (బుధవారం) లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో చిత్ర యూనిట్ సినిమా పనులను ప్రారంభించింది. జూన్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు. రష్మిక మందన్న చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహతి సాగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే నితిన్ త్వరలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయనున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్కి పవర్ పేట అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు టాక్. తెలుగుతో పాటు మరో రెండు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో వేరే భాషలకి చెందిన నటీనటులు కూడా ఉంటారని టాక్.
previous post
next post