“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బి, సీ సెంటర్స్లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్కు ఆదరణ బాగుంది. ఈ సినిమా సక్సెస్ ప్రెస్మీట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేశ్ “రాక్షసుడు” సక్సెస్ పట్ల చిత్ర యూనిట్ సహా తాను కూడా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు. “రాక్షసుడు” సినిమాపై మాట్లాడుతూ ‘‘ఈ సినిమా హిట్ అయింది. మంచి వసూళ్లు రాబట్టింది. శ్రీనివాస్ గత చిత్రాలకు అధిక బడ్జెట్ కేటాయించడం వల్లే అవి ఫెయిల్యూర్ అయ్యాయి. బడ్జెట్ నియంత్రణ ఉంటేనే సినిమాలు హిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస్తో మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దర్శకుడి కోసం కూడా వెతుకుతున్నాం.’’ అని అన్నారు.
previous post
భయపడి బయటకు రాలేదు… ఇప్పుడా బాధ లేదు : సమీరా రెడ్డి