బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు కె.ఎస్. కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘స్టూవర్ట్పురం దొంగ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇది 1970 ప్రాంతానికి చెందిన ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే ఒక గజదొంగ బయోపిక్. ఈ సినిమాను బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తుండగా, దర్శకుడిగా కె.ఎస్ పరిచయమవుతున్నాడు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీత అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి పనిచేసే ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను తెలియపరుస్తామని మేకర్స్ తెలియజేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం హిందీ రీమేక్ ఛత్రపతి సినిమాతో బిజీగా ఉన్నాడు.