తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత”. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. మే 24న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది.
తాజా ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ “తేజ రెండు కథలతో మమ్మల్ని కలిశారు. మా నాన్నకి నాకు కలిపి రెండు కథలను వినిపించారు. నాకు “సీత” కథ నచ్చింది. మా నాన్నకు మాత్రం మరో కథ నచ్చింది. అది యాక్షన్ ఎంటర్టైనర్. ఆ సినిమానే చేయమని నాన్న అన్నాడు. నేను ఎప్పుడూ మా నాన్న ఓకే చెప్పిన సినిమానే చేస్తాను. ఈ సారి మాత్రం నాకు “సీత” కథ నచ్చిందని చెప్పి, ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సినిమా చేశాను. అందుకే ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. పాత్ర పరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన ఈ సినిమా సక్సెస్ కూడా ఇస్తుందనే నమ్మకంతో వున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్