telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఖాతాదారులకు షాక్‌…రేపటి నుంచి బ్యాంకులు బంద్ !

ఖాతాదారులకు షాక్‌ ఇచ్చాయి బ్యాంకులు. అదేంటీ అనుకుంటున్నారా.. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక రేపు రెండో శనివారం కాగా..ఎల్లుడి ఆదివారం సెలవులు ఉండనున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం ఈ నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

Related posts