సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనఅధినేత పవన్ కల్యాణ్ ను తన దేవుడుగా ఎప్పుడూ చెప్పకునే బండ్ల గణేశ్… మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ ప్రాణమేనని ట్వీట్ చేశారు.
తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ విషయంలో తాను ప్రతి రోజు శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరమని ఘాటుగా వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. పల్నాడు పరిస్థితులను ప్రస్తావిస్తూ అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను నమ్మవద్దని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.