telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ గడిలా పాలనా, నియంతృత్వ పాలనను అంతం చేస్తాం..

జనగామ ఘటనపై బండి సంజయ్ కేసీఆర్‌ ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఫైర్‌ అయ్యారు. బీజేపీ కార్యకర్తలను CI, SI ఇద్దరు విచక్షణా రహితంగా కొట్టారని..శ్వాస ఆడడం లేదని వేడుకున్నా వదలలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొంతమంది IPS అధికారులు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి వారి రక్తం కళ్ళ చూస్తున్నారని… ఆరేళ్ళ నుండి ఫామ్ హౌజ్ లో పడుకొని బయటకు రాని సీఎం ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని మండిపడ్డారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారని.. కానీ మానవత్వం లేని కేసీఆర్ మాత్రం స్పందించలేదని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ గడిలా పాలనా, నియంతృత్వ పాలనను అంతం చేస్తామని… జనగామలో దాడిచేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై 307సెక్షన్లో కేసులు నమోదు చేయాలని… లేకపోతే నీ గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. నీ ఇంటలిజెన్స్ వ్యవస్థ కూడా మమ్మల్ని కనిపెట్టలేదని.. 24గంటల డెడ్ లైన్ విడుస్తున్నామన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పమని… చేసి చూపిస్తాం.. మా దెబ్బతో కేసీఆర్ దిగి రావాల్సిందేనన్నారు. కేసీఆర్ కొడుకును కూడా వీపు చింతపండుచేసి సారీ చెప్తే సరిపోతుందా…? అని మండిపడ్డారు.

Related posts