telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి మూర్ఖుడిలా, రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు.  కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోవడానికి ఇది టిఆర్ఎస్ పార్టీ కాదని బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మేము ఉద్యమం చేసేంతవరకు చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రికి ఉద్యమం ద్వారా భయం చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మూర్ఖుడిలా, రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తల స్థానాన్ని పిరికితనంగా భావించవద్దు తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీన్ని ఎదుర్కోవడానికి దమ్ము ముఖ్యమంత్రికి ఉందా…? అని సవాల్‌ విసిరారు. కేంద్రం నిధులను దారి మళ్లించి… అడ్డంగా దోచుకున్నారని… ఇప్పుడు మళ్లీ కలిసి పని చేద్దాం అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని నాయకులు కలిసి పనిచేద్దాం అంటారా..? అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్‌.

Related posts