telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో మూడేళ్లు ముఖ్యమంత్రి కేసీఆరే…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్లు ముఖ్యమంత్రి కేసీఆరే అని… కేటీఆర్ ను సిఎం చేసే ఆలోచన కేసీఆర్ కు లేదని బండి సంజయ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ, గడీల, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని… టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపి వైపు నిలబడుతున్నారని…ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాల పర్వానికి కెసిఆర్ చమరగీతం పాడకపోతే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తుంటే.. కమీషన్ల పేరిట కోట్లకు కోట్లు వెనకేస్తూ.. ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేయాలని కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని… ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని ప్రయత్నాన్ని మరోసారి ప్రజలు తిప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Related posts