telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒకే కుటుంబం రాజ్యం ఏలుతోంది… సమాజం మేల్కొనాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై ఆరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు బండి సంజయ్అ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మోడీ చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. దళితులు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని వారికి రుణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని కొనియాడారు.అంబేద్కర్, ఇతర మహనీయుల జయంతి, వర్దంతిలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదు… సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష మందితో ఎన్నికల సభ పెట్టేందుకు టైం దొరుకుతుంది కానీ.. అంబేద్కర్ కు నివాళులు అర్పించేందుకు టైమ్ దొరకడం లేదా అని నిలదీశారు. Ktr ముఖ్యమంత్రి అని, సంతోష్ కుమార్ సీఎం అని అంటున్నారు..తెలంగాణను పాలించే అర్హులైన దళితులు పార్టీలో లేరా అని నిలదీశారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గడీల పాలనలో ఉన్న తెలంగాణ తల్లికి విముక్తి కలిగిద్దామని పిలుపు ఇచ్చారు బండి సంజయ్. ఒకే కుటుంబం రాజ్యం ఏలుతోంది… సమాజం మేల్కొనాలి.. ఏ ఆశయం కోసం తెలంగాణ సాదించుకున్నామో దాని కోసం పని చేద్దామని పేర్కొన్నారు. దళితులు పొగ పెట్టడం స్టార్ట్ చేశారు కాబట్టే ఈ రోజు కొడుకు బయటకు వచ్చారన్నారు. దళిత సంఘాలు సీఎం ని ఎందుకు నిలదీయడం లేదు.. భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, ప్రగతి భవన్ సాధ్యం అయినప్పుడు అంబెడ్కర్ విగ్రహం కి ఉన్న అడ్డంకులు ఏంటి..? అని నిలదీశారు.

Related posts