telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం కూప్పకూలబోతుంది.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలోనే  కేసీఆర్‌ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూల బోతోందని… ఆ విషయం తెలిసి కేసీఆర్ వణికి పోతున్నాడని తెలిపారు. అందుకే ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ఇస్తా అని చెప్పి ఉంటాడని.. పీఆర్ సి ఇస్తా అనడం అది పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ ప్రభుత్వం దగ్గర పైసలే లేవు అందుకే 7.5% కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వలేమని బిస్వాల్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు 1 తేదీన జీతాలే ఇవ్వలేని ఈ సర్కార్ పీఆర్సీ ఇస్తుందంటే నమ్ముతామా… గవర్నమెంట్ కూలిపోకుండా భయపడి చెబుతున్నాడని మండిపడ్డారు.

Related posts