telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్‌ గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోంది-బండి సంజయ్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. నిజమైన సేవ చేసేవారికే ప్రజలు పట్టం కడుతారని అన్నారు. హుజూరాబాద్ ఫలితాల్లో భాజపా అధిక్యం కనబరుస్తుండడంతో పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈటల గెలుపును భాజపా విజయంగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

హుజూరాబాద్‌ గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోందని, ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈటల గెలుపుతో తెలంగాణలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకుంటున్నారనేది స్పష్టమైందని తెలిపారు. ఈటల రాజేందర్‌ భాజపా నాయకుడు… ఈటల గెలుపు భాజపా గెలుపు… భాజపా గెలుపు ఈటల గెలుపేనని బండి సంజయ్‌ అన్నారు. దళితబంధు అమలు చేసినా సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మడంలేదని ఎద్దేవా చేశారు.

Related posts