telugu navyamedia
తెలంగాణ వార్తలు

మరోసారి బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత..

ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర మరోసారి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో బండి సంజయ్​ పర్యటన సందర్భంగా అడుగడుగునా నిరసనల సెగ తాకుతోంది.

యాత్రలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చేరుకున్న బీజేపీ బండి సంజయ్ యాత్రను రైతులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, చెప్పులతో నిరసన తెలిపారు.. సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో   బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు.  ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

BJP, TRS men clash during Bandi's visit to PPCs

 ఈ నేపథ్యంలో.. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రైతుల సమస్యల కోసం ఎందాకైనా పోరాడతామని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Related posts